News

దమ్ముంటే ఢిల్లీలో దీక్ష చేయాలి:రావెల


జగన్‌కు దమ్ముంటే ఢిల్లీలో దీక్ష చేయాలని రావెల కిశోర్‌బాబు సవాలు చేశారు. దీక్షల పేరుతో జగన్‌ గుంటూరులో అలజడి సృష్టించాలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. జగన్‌ అభివృద్ధి నిరోధక దీక్ష చేస్తున్నారని, ఆయన ప్రవర్తనను ఆ పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చే అతిధులను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.